SAKSHITHA NEWS

ధయ, ధర్మమార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : 128 – చింతల్ డివిజన్ రొడా మేస్త్రి నగర్ లోని “హజీ అలీ మస్జిద్” వద్ద నిర్వహించిన మిలాద్ ఉల్ నబీ వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ ఇస్లాం మత స్థాపకులు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజును పండుగగా నిర్వహించుకున్న రోజే “మిలాద్ – ఉల్- నబీ” అని అన్నారు. ఈ సంధర్బంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు మాక్సూద్ అలీ, మసీద్ పెద్దలు అధ్యక్షులు సదర్ రషీద్ భాయ్, ఉస్మాన్ భాయ్, మసీద్ ఇమామ్ సయ్యద్ రియాజ్, మిలాద్ కమిటీ అధ్యక్షులు సలీం బాయ్, ఫిరోజ్ భాయ్, సయీద్ బాయ్, వహీద్ అలీ, నిజాం భాయ్, యూనుస్ భాయ్, శౌకత్ అలీ, దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS