SAKSHITHA NEWS

సాక్షిత సికింద్రాబాద్ : తార్నాక లోని నాగార్జున నగర్ ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, వివిధ ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ టీ.తిరుపతి రావు, ప్రధాన కార్యదర్శి ఏ.జలంధర్ రెడ్డి, ఎస్.నాగేశ్వర్ రావు తదితరుల బృందం గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో కలిసింది. నాగార్జున నగర్ కాలనీ లోని వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ భవనాల విస్తరణ కు చర్యలు తీసుకోవాలని కోరింది. వివిధ సమస్యల పై వినతి పత్రాన్ని వారు అందించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత అధికారుల ద్వారా నివేదికలు, అంచనాలు తెప్పిస్తామని, నిధులకు వెనుకాడకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.


ఇంటి పట్టా పంపిణీ
అడ్డగుట్ట కు చెందిన అంజయ్యకు జీ వో నెంబరు 5 8 ద్వారా మంజురైన పట్టా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ గురువారం తన కార్యాలయంలో కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, సామల హేమ, రాసురి సునీత తదితరుల సమక్షంలో అందించారు.


SAKSHITHA NEWS