SAKSHITHA NEWS

సాక్షిత రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం పై చేస్తున్న కార్యక్రమాలను జెసి కి వివరించారు. జిల్లాలో ఆహార భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. జెసి మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లాలని సూచించారు, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతానన్నారు. త్వరలో డిసిపిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.


SAKSHITHA NEWS