SAKSHITHA NEWS

దళిత వాడ సహపంక్తి భోజనాల్లో ఎమ్మెల్యే

  • సంక్షేమ పథకాలు జగన్ తోనే సాధ్యమని ఉద్ఘాటన

…………..

                                                     సాక్షిత, తిరుపతి బ్యూరో: నగర పరిధిలోని 50వ డివిజన్ తిమ్మనాయుడు పాలెంలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలతో  సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కార్యకర్తలుగా తామంతా ఇంటింటికీ వెళ్తుంటే ప్రజలు అనూహ్యంగా స్వాగతిస్తున్నారని కరుణాకర్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి తమకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని, అందువల్ల మళ్లీ మళ్లీ గెలిపించు కుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.
వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా ఉందని, గతంలో ఎన్నడూ ఇంత గొప్పగా చేసిన ప్రభుత్వాలను చూడలేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారని ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి వివరించారు. తిరుపతిలో రాజకీయాలకు ఆతీతంగా సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం అందుతోందన్నారు.
తిమ్మనాయుడుపాలెం హరిజనవాడ గ్రామస్తులు తో కలిసి ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు బోకం అనిల్ కుమార్, ఆదం రాధాకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS