* పోలీసు సిబ్బందికి సీపీ రివార్డులు* 

Spread the love

*చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి సీపీ రివార్డులు*  

 
సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన పోలీసు సిబ్బందికి ఈరోజు సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారు అభినందించి, రివార్డులు అందజేశారు.
 
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ లో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చాకచక్యంగా ఛేదించినందుకు గాను నార్సింగి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శివ కుమార్, నార్సింగి డీఐ శివ కుమార్, నార్సింగి డీఎస్ఐ అశోక్ వర్మ, రాయదుర్గం డి‌ఐ రాజగోపాల్ రెడ్డి, గచ్చిబౌలి డిఐ రవీందర్, నార్సింగి గచ్చిబౌలి రాయదుర్గం పోలీస్ స్టేషన్లకు చెందిన 12 మంది పోలీస్ కానిస్టేబుల్ లను సీపీ గారు క్యాష్ రివార్డు అందజేశారు.  
 
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, మాదాపూర్ ఎసిపి శ్రీ రఘునందన్ రావు, ఇన్‌స్పెక్టర్లు, డీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

 

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

You cannot copy content of this page