SAKSHITHA NEWS

గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా బొల్లారం మున్సిపాలిటీలలో విగ్నేశ్వరుడికి భక్తులు విశేష పూజలు అందిస్తున్నారు. ఈ సందర్బంగా వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వాహకులు, దాతలు ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్’లో ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడికి బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి.వరప్రసాద్ రెడ్డి , దిననాధ్ , సతీష్ , సురేష్ , నారాయణ , సాయి , సంతోష్ , భాస్కర్ , తారకేష్ , దాస్ , మోహన్ , కమిటీ నిర్వాహకులు, భక్తులు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS