SAKSHITHA NEWS

వార్డులో పర్యటించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .


సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ 16వ వార్డ్ లోని చాకలి బస్తి, ముస్లిం బస్తీ లో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న చిన్నపాటి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించారు. అనంతరం ముస్లిం బస్తీ లోని BRS కార్యకర్త అయిన అంజాద్ ఇటీవలే బైక్ ప్రమాదానికి గురి కావడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. మరియు అదే బస్తీలోని ఇమమోద్దీన్(లడ్డు) అనారోగ్యానికి గురి కావడంతో వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డ్ BRS పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ అక్రమ్ , ముదిరాజ్ సంగం అధ్యక్షులు మన్నె బాలరాజు , జితయ్య, ఇమ్రాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS