గణేష్ నగర్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గణేష్ నగర్ లోని సమస్యల గురించి కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయానికి విచ్చేసి వారి సమస్యలను తెలియచేయడం జరిగింది. వెంటనే స్పందించిన కార్పొరేటర్ కాలనీకి వెళ్లి వారితో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గణేష్ నగర్ కాలనీ ప్రజలు విన్నవించిన్న ప్రకారం ప్రధానంగా గతంలో కాలనీకి ఒకవైపు ప్రహరీ గోడ ఉండేదని, ఇప్పుడు అది శిథిలావస్థకు చేరి పడిపోవడంతో దొంగల బెడద ఎక్కువై కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి తీసుకువచ్చారు కాబట్టి ఈ సమస్యను ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తో మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రహరీ గోడ పునర్నిర్మాణం జరిగిలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే కాలనీలో కొంతమేర పెండింగ్ ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులు కూడా త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సోమేశ్వరరావు, నరసింగ్, రెడ్డి, మోజెస్, కనకయ్య, మహేందర్, జానీ, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page