గాంధీ నగర్లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గాంధీ నగర్ లో డ్రైనేజీ, రోడ్లు మొదలగు సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ గాంధీ నగర్లో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గాంధీ నగర్ కాలనీలో ఇప్పటికే డ్రైనేజీ లైన్ సాంక్షన్ అయ్యి ఉంది కాబట్టి ఇంకో రెండు లేదా మూడు రోజులలో నిర్మాణ పనులు మొదలుపెడతారు అని అన్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వారు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్ వైర్ల సమస్య మరియు కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు వెలగడం లేదని కాలనీ వారు కార్పొరేటర్ గారితో తెలుపగా వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో CH. భాస్కర్, గాంధీ నగర్ ప్రెసిడెంట్ ప్రభాకర్, సదానంద్ గౌడ్, మల్లేష్, మహేష్, మధులెడ్డి, రమాదేవి, ప్రకాష్, శంకర్, కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page