మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ చేతులమీదుగా డివిజన్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కావున మట్టి విగ్రహాలను పూజించి వినాయక పండుగ ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, రాములుగౌడ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, ఫజల్, సతీష్, సాయిగౌడ్, రాజేందర్, జనయ్య, వెంకట్, ఖలీమ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, షేక్ బిబి, వరలక్ష్మి, వనజ, బి.లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page