SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు డివిజన్ పరిధిలోని సాయినగర్ ఈస్ట్, సాయినగర్ వెస్ట్, రాఘవేంద్ర నగర్ మరియు ఆదిత్య నగర్ కాలనీలలో స్థానిక వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. సాయినగర్ లో కరెంట్ స్తంభం ఒకటి ఒరిగి ప్రమాదకరంగా ఉందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సాయినగర్, రాఘవేంద్రనగర్ మరియు ఆదిత్య నగర్ కాలనీలలో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తామని కాలనీ వాసులు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, రాజేష్ చంద్ర, కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, జి.ప్రభాకర్, నాగేశ్వరరావు, శ్రీధర్, సంతోష్ బిరాదర్, ఉమేష్, రఘు, కె.ప్రకాష్, సుధాకర్ రెడ్డి, సతీష్, రమేష్, దామోదర్ రెడ్డి, కుమార్, కె.రవి, నరసింహ, సాంబశివరావు, శేఖర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, సిఎచ్.భూమన్న, మోహన్ గుప్తా, నబి, యాదగిరి, బాలస్వామి, ప్రదీప్ రెడ్డి, రాములుగౌడ్, మల్లేష్, వెంకటేష్ గౌడ్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, ఇంతియాజ్, రవీందర్, అర్జున్, బాలస్వామి, ఆదర్శ్, సాయిగౌడ్, కూర్మయ్య, బాబు నాయక్, బాలరాజు, దేవేందర్, సతీష్, జనయ్య, అజ్జస్, రాజ్యలక్ష్మి, శిరీష సత్తుర్, లక్ష్మమ్మ, పుట్టం దేవి, షేక్ బీబీ, స్వరూపా, స్వప్న, వరలక్ష్మి, రేణుక, సురేఖ, ప్రీతి, నస్రీన్, నిర్మల, బి.లక్ష్మీ జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS