తెలుగు నాటక రంగస్థల దినోత్సవ కార్యక్రమంలో.. కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్

తెలుగు నాటక రంగస్థల దినోత్సవ కార్యక్రమంలో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

SAKSHITHA NEWS

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీలోని నాటక మండలి వద్ద సాయంత్రం తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థలం సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సురభి రేకందార్ వేణుగోపాల్ రావు కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరకపూడి గాంధీ కలిసి ఘన సత్కారం చేశారు. అనంతరం ఇటీవలే విడుదలై అందరి హృదయాలను మెప్పించిన ‘బలగం’ సినిమా కళాకారులు విజయలక్ష్మి, అనురాధ, జ్యోతి, వీణ, అరుణ, నిరూపమ, సాహిత లకు ఎమ్మెల్యే , కార్పొరేటర్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సురభి కాలనీ కళాకారులు, సురభి కాలనీ అసోసియేషన్ సభ్యులు, యువసేన సభ్యులు, కాలనీవాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే, కార్పొరేటర్ కు సన్మానించి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సురభి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, దేవాలయ కమిటీ మెంబర్స్ విజయానంద్, కోదండరాం, రఘునాథ్, కాలనీ సెక్రటరీ రమణ, వెంకట్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, భాగ్యలక్ష్మి, సుధారాణి, యువసేన సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS