SAKSHITHA NEWS

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ టిడిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను ఆశీర్వదించాలని సోమిరెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎమ్మెల్సీ మొదట ప్రాధాన్యత ఓటు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థికి వేయాలని అభ్యర్థించారు. నకిలీ మద్యం, సిలికాలో ప్రధాన పాత్ర పోషించిన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టిందని ఆరోపించారు


SAKSHITHA NEWS