కండ్లకోయ సభకు భారీగా తరలి రండి

Spread the love

కండ్లకోయ సభకు భారీగా తరలి రండి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత : మేడ్చల్ కండ్లకోయలో నూతనంగా నిర్మించబోతున్న ఐటీ పార్క్ శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచేయుచున్నందున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విచేయుచున్న భారీ బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు 4 గ్యారంటీలు అమలు అయ్యాయని త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా అర్హులైన వారికి ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page