SAKSHITHA NEWS

CM KCR inaugurated the Mahabubabad District Integrated Collectorate

మహబూబాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

మహహబూబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల వందనం స్వీకరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ శశాంకను సీట్‌లో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దాయకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రాజయ్యతోపాటు ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిథులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంత‌కుముందు నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు.


SAKSHITHA NEWS