SAKSHITHA NEWS

అనాధాశ్రమానికి చేయూతనిచ్చిన : సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సంజీవిని అనాధాశ్రమానికి గిద్దలూరు సీఐ ఫిరోజ్,ఎస్సై బ్రహ్మనాయుడు చేయూతను అందించారు. తమ వంతుగా అనాధాశ్రమానికి నాలుగు బస్తాల బియ్యం రెండు నెలలకు సరిపడ్డ సరుకులు ఒక సీలింగ్ ఫ్యాన్ అందించారు.

ఆశ్రమం నిర్వాహకుడు రాజశేఖర్ కు బియ్యం నిత్యావసర వస్తువులను ఎస్సై బ్రహ్మనాయుడు అందజేశారు.అలానే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుల కోసం ఓరియంట్ సీలింగ్ ఫ్యాన్ ఆశ్రమానికి బహుకరించారు. అలానే ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమంలో ఉన్న వృద్ధులను పలకరించారు.ఆశ్రమం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సై బ్రహ్మనాయుడు అన్నారు.

నిత్యవసర సరుకులు,బియ్యం సీలింగ్ ఫ్యాన్ అందజేసిన సిఐ ఫిరోజ్ కు ఎస్సై బ్రహ్మనాయుడుకి ఆశ్రమం నిర్వాహకుడు రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు


SAKSHITHA NEWS