దొంగతనాలు అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని సీఐ భీమా నాయక్ కోరారు

Spread the love

దొంగతనాలు అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని సీఐ భీమా నాయక్ కోరారు

ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ పరిధిలో దొంగతనాలు అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సిఐ భీమా నాయక్ విజ్ఞప్తి చేశారు. దూరప్రాంతాలు లేదా విహారయాత్రలకు వెళ్లే గృహ యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ,దూర ప్రాంతాలకు వెళ్లే గృహ యజమానులు ఇంటిలో భారీగా నగదు కానీ విలువైన వస్తువులు బంగారం వంటివి ఇంటిలో ఉంచకుండా బంధువుల ఇళ్లలో కానీ బ్యాంక్ లాకర్ లో కానీ భద్రపరచుకోవాలని , మూడు లేదా నాలుగు రోజులు పెళ్లిళ్లకు ఇతర అవసరాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని,సూచించారు. ప్రజలకు తెలిసే విధంగా పలు ప్రధాన కూడళ్లలో మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేశారు.. ఇంటి పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

Related Posts

You cannot copy content of this page