బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలి – యస్.పి అపూర్వ రావు

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 30 at 4.31.10 PM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత –

  • జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్

— ఆపరేషన్ ముస్కాన్ సమన్వయ సమావేశం
 
నల్లగొండ సాక్షిత ప్రతినిధి

బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలని యస్.పి అపూర్వ రావు ఐపిఎస్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై1 నుండి నెల రోజుల వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా యస్.పి అపూర్వ రావు అధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా యస్.పి మాట్లాడుతూ నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని అన్నారు. జూలై 1వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో మూడు సబ్ డివిజన్లో   పోలీస్, లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్, ఐసిడిఎస్, శిశు సంక్షేమం అధికారులతో సమన్వయంగా కలిసి బృందంగా ఏర్పడి తప్పి పోయిన బాల బాలికలను గుర్తించుట,పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు  ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే అలాంటి వారిని గుర్తించి సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు ఉన్న, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని యస్.పి కోరారు. ఇలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందిని అన్నారు. ఎక్కడైనా బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో డిడబ్ల్యుఓ కృష్ణవేణి,
డిసిపివో గణేష్, సి డబ్లు సి చైర్మన్ కృష్ణ,నల్గొండ , మిర్యాలగూడ, దేవరకొండ లేబర్ అధికారులు , చైల్డ్ లైన్ ఆంజనేయులు, ఎ.హెచ్.టి.యు ఎస్. ఐ గోపాల్ రావు, మిగతా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyouth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాంయువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం – యువజన సంఘాల అధ్యక్షులు మండ అశోక్ కమలాపూర్ సాక్షిత న్యూస్ ( జులై 6 ) youth యువకులకు, సామాన్య ప్రజలకు…


SAKSHITHA NEWS

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSgodavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page