అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి మరువలేనిది – చైర్మన్ వెంకట్ రెడ్డి

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి చైర్మన్ వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్‌ రామ్‌ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కమిషనర్ మందడి రామదుర్గా రెడ్డి,మేనేజర్ పాతిమ, కౌన్సిలర్లు బెల్లీ సత్తయ్య కోనేటి కృష్ణ, కోఆప్షన్ సభ్యులు జమీరుద్దీన్, నాయకులు దాసరి నరసింహ, పొన్నం లక్ష్మయ్య,సిలివేరు శేఖర్, జిట్ట చంద్రకాంత్, జయరపు శివ, గండమల్ల శంకర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page