SAKSHITHA NEWS

భారీ వర్షాల కారణంగా జలమయం ఐన కాప్రా డివిజన్ సాయి రామ్ నగర్ కాలనీ లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పర్యటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ

★భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా
ఉండాలి అని

★ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర అయితే తప్ప బయటకు రాకూడదు అని ఆయన అన్నారు.
ప్రభుత్వ అధికారులు ,యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ అలర్ట్ గా ఉండాలి..

★ అధికారులు హెల్ప్ లైన్ సెంటర్ లు ఏర్పాటు చేసి ,పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలి అని

★ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS