SAKSHITHA NEWS

హైదరాబాద్‌ :
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు.

రాష్ట్ర క్యాబినెట్‌లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు. అందులో భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై, వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సి ప్రత్యామ్నాయ విధానాలపై సమీక్షిస్తారు. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై అంచనాలను సిద్ధంచేసి, యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతోపాటు ఆగస్టు 3 నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, అందులో చర్చించాల్సిన అంశాలను క్యాబినెట్‌లో నిర్ణయించనున్నారు…


SAKSHITHA NEWS