SAKSHITHA NEWS

దివ్యాంగులకు బస్సు పాస్ రెన్యువల్

గూడూరు మండలంలోని గ్రామ దివ్యాంగులకు టీజీ ఆర్టీసీ నర్సంపేట డిపో వారు 19 తేదీన వికలాంగులకు బస్సు పాస్ రెన్యువల్ చేయుటకు ఉదయం 8:30 నుండి 1:30 వరకు గూడూరు బస్టాండ్ లో క్యాంపు నీర్వహిస్తున్నారు. కావున వికలాంగులు అందరు సదరన్ సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో,50 రూపాయలు తీసుకొని తప్పకుండా రాగలరు మరియు మహిళా వికలాంగులు కూడా తప్పకుండా రెన్యువల్ చేసుకోగలరు వారికి డీలక్స్ బస్సులో హాఫ్ టికెట్ మరియు పట్టణ ప్రాంతంలో ఉచిత ప్రయాణం కలదు.గూడూరు మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుర్రం ప్రభాకర్ జిల్లా కార్యదర్శి రుద్ర తిరుపతి ప్రకటనలో తెలిపారు


SAKSHITHA NEWS