SAKSHITHA NEWS

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిక…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని చంద్రగిరి నగర్ చెందిన కాంగ్రెస్ నాయకులు సయిద్ షబ్బీర్, సయిద్ ఉస్మాన్, సయిద్ జాకీర్, సుజిత్, సయిద్ నూరి, సయిద్ ఫార్జాద్ బీ లు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో సీనియర్ నాయకులు ఊర్మిళ, ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ అని, అందరి చూపు టీఆర్‌ఎస్‌ వైపే ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో బిఆర్‌ఎస్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది బిఆర్‌ఎస్‌ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బైగ్, పర్శ శ్రీనివాస్, నవాబ్, సింగారం మల్లేష్, మూసా ఖాన్, రాంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఇబ్రహీం, అబేద్, మసూద్, దుల్లప్ప, దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్, తెలంగాణ సాయి, లక్ష్మణ్, నగేష్, జునైద్, హమీద్, ఓ శ్రీనివాస్త, శివ, క్రాంతి, శ్రీనివాస్ది, ఈశ్వర్, మధు, రంజాన్, మహిళా నాయకులు పార్వతి, మంజుల, రాధా భాయ్, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 16 At 3.43.02 Pm

SAKSHITHA NEWS