పొంగులేటి శీనన్న ను విమర్శించే స్థాయి బిఆర్ఎస్ నాయకులకు లేదు

Spread the love

కామేపల్లి మండల అడహాక్ కమిటీ నియామకం లో కోరం కనకయ్య,తుళ్లూరు బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్ వ్యాఖ్యలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పొంగులేటి శీనన్నను నమ్మించి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించి నమ్మక ద్రోహం చేసిన ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ నాయకులకు శీనన్నని విమర్శించే స్థాయి లేదని, నమ్మకద్రోహం చేసిన పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి, శీనన్న సత్తా ఏమిటో చూపిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మేకల మల్లి బాబు యాదవ్ పేర్కొన్నారు.

కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అధ్యక్షతన జరిగిన శీనన్న అభిమానుల అడహాక్ కమిటీ సమావేశంలో పొంగి రెడ్డి శీనన్న అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మండలంలో గతంలోకోరం హయాంలో జరిగిన అభివృద్ధితప్ప, ప్రత్యేకంగా ఇప్పుడు , ఒరిగిందేమీ లేదని, ఎంత మంది ఎదురు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అధికార పార్టీ పరంగా ఎన్ని కుట్రలు జరిపినా, శీనన్న సైన్యం కోరం కనకయ్యని గెలిపించుకుంటుందని పాల్గొన్న మండల నాయకులు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు షేక్ పతే మహమ్మద్, మాజీ టిడిపి అధ్యక్షులు పుచ్చకాయల సత్యనారాయణ, కాట్రాల వీరబాబు, మత్స్యశాఖ సంఘ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు రాయల ఉపేందర్, అరెం రవి , ముత్తెబోయిన రామ్మూర్తి సంపత్, సతీష్ బానోతు నరసింహ నాయక్ మేకపోతుల మహేష్ ఇమ్మడి రామనాథం, బిచ్చు నాయక్, బండి ఉపేందర్, బండి లక్ష్మీ నర్సు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాదు, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు భూక్య నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page