SAKSHITHA NEWS

బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్

ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షిత పటాన్చెరు : ప్రతి ఒక్కరిలో సోదరుభావం పెంపొందించాలన్న లక్ష్యంతో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జిఎంఆర్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS