SAKSHITHA NEWS

ఛత్తీస్‌గఢ్‌ లో వరుస ఎన్కౌంటర్ లకు నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసి మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది.

ఇక ఈ కాల్పులతో నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్ లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు.


SAKSHITHA NEWS