గోల్కొండలో జరిగిన శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
గోల్కొండకు చెందిన రాఘవ, రాహుల్, వరుణ్ తేజ్, ఎల్ఎన్ఆర్ వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీ జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కృపాకటాక్షాలు ఆయురారోగ్యాలతో అందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..
ఈ సందర్భంగా తొట్టెల ఊరేగింపు నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో నేమూరి రాములు గౌడ్ మరియు క్యాతం అశోక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

