SAKSHITHA NEWS

అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇందిరా నగర్ కు చెందిన జిట్ట అంజమ్మ అనారోగ్యంతో మృతిచెందటం తో విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ అంజమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం 5వేల రూ.ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూరెళ్ల శ్రీను,పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, దళిత మోర్ఛ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాస శ్రీనివాస్, కిసాన్ మూర్ఛ నియోజక వర్గం కన్వీనర్ జిట్టా కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కోళ్ల స్వామి,సతీష్ తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS