యార్కారం గ్రామ పంచాయితీ శాంతి నగర్ లో గడపగడపకు బీజేపీ కార్యక్రమం

Spread the love

పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామ పంచాయతీ శాంతి నగర్ లో బిజెపి నాయకులు గడప గడప తిరుగుతూ నల్గొండ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి భారత ప్రధాని నరేంద్రమోడీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మూడవసారి నరేంద్రమోడీ సర్కారు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ బిజెపికి ఓటు వేసి భారతదేశ అభివృద్ధికి సహకరించాలని నాయకులు కార్యకర్తలు ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు మోదాల శ్రీనివాస్, బిజెపి నాయకులు మోదాల రమేష్,ఆవుదొడ్డి కిరణ్,మర్యాద మధు,లాల్ సింగ్ నాయక్, మోదాల లింగారాజ్, బాషబొయిన పరమేశ్,దుశ్చర్ల సాయి,మోదాల మధు,బత్తుల లింగరాజ్ యాదవ్,మర్యాద నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page