శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్

Spread the love

శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామ సోమేశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ హాజరయ్యారు. ఆలయ పూజారి భీమ్ భరత్ ను ఆశీర్వదించి సన్మానించారు. భీమ్ భరత్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భీమ్ భరత్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని శివయ్యను వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి రెడ్డి, శంకర్, శశికాంత్, నర్సింలు, వెంకట్ రెడ్డి, శారు, బాలరాజ్ యాదవ్, రాములు, యాదయ్య, శ్రీశైలం, రామచందర్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page