భగత్ సింగ్ 94 వ వర్ధంతి ఘనంగా

Spread the love

ఘనంగా భగత్ సింగ్ వర్థంతి
కొడిమ్యాల: మార్చి 23 ( )
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సండ్రాల పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 94 వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతరం ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 1931 మార్చి 23 న చనిపోయాడని, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని, ఈయన చిన్న తనం లోనే చనిపోయాడని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page