SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ…..
ప్రజల పక్షాన ప్రశ్నించడం లో జనసేన పార్టీ ఎపుడు ముందు ఉంటుంది

బాపట్ల నియోజకవర్గంలో ఈ నాలుగేళ్ల కాలంలో అసలు ఏం అభివృద్ధి జరిగింది?

ఊరికే అభివృద్ధి చేసాం అని చెప్పుకోవడం కాదు

మీరు నిజం గా నియోజకవర్గం లో అభివృద్ధి చేస్తే మీరు చేసిన అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఓ శ్వేత పత్రం విడుదల చేయాలి అని అన్నారు

కేవలం బాపట్ల పట్టణం లో మాత్రమే రోడ్లు విస్తరణ చేస్తే సరిపోదు నియోజకవర్గంలో ఉన్న రోడ్లు మొత్తము కూడా అభివృద్ధి జరగాలా అని శివన్నారాయణ అన్నారు.

బాపట్ల పట్టణంలో నిర్మిస్తున్న డ్రైనేజీ రోడ్లు కూడా పాము మెలికలు తిరగడంలో అంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు‌.

ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ ఆరమల్ల సుజిత్, ఉసా ప్రసాద్, ఎస్.కె ఆసిఫ్, గంటా నాగమల్లేశ్వరరావు , ఇమ్మడిశెట్టి సురేష్, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మరియు జన సైనికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS