బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు

Spread the love

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్‌.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మార్చి 15న కమిషనర్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఆరోజు హాజరుకాలేనని తెలిపారు. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సూచించినట్టుగా ఈనెల 18న హాజరవుతానని లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్‌ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆయన కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.


Spread the love

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్