అసెంబ్లీ సాక్షిగా మీసం మెలేసిన బాలకృష్ణ!

Spread the love

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి, టిడిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు.

ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి ఫైర్ అయ్యారు. మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూపించుకోవాలని బాలకృష్ణను అంబటి అన్నారు.

దీంతో ఫైర్ అయిన బాలకృష్ణ చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్ విసిరారు. అంబటి సైతం ‘రా చూసుకుందాం’ అని ప్రతి సవాల్ విసిరారు. అంబటి సవాల్‌కు బాలకృష్ణ మీసం మెలేసి తొడిగొట్టారు. దీంతో తామూ మెలేస్తాం అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు.

ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది..

Related Posts

You cannot copy content of this page