దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్

Spread the love

చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 2024 తేదీ 24 ఫిబ్రవరి 2024 జరిగింది. దానిలో భాగంగా విన్నర్స్ గా కేపీ కంగారు, రన్నర్స్ గా మాస్టర్ బ్లాస్టర్స్ సెకండ్ రన్నరఫ్ గా చౌదరి వారియర్స్ గెలుపొందడం జరిగింది. గెలుపొందిన విజేతలకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తో కలిసి బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 2024 నిర్వహించడం చాలా అభినందనీయం అని , క్రీడల వలన శారీరక శ్రమ తో పాటు మానసిక దృఢత్వం లభిస్తుంది అని , క్రీడలు మానసిక ఉల్లాసంను పెంపొందిస్తాయి అని , స్నేహ భావం పెంపొందుతుంది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. యాంత్రిక జీవనంలో ప్రజలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయి అని ప్రతి ఒక్కరు ఎదో ఒక క్రీడను ఎంచుకొని ఉన్నత స్థితిలోకి రావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు .విజేతలకు అభినందనలు తెలియచేసారు. నిర్వాహకులను ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి సుంకర సత్యనారాయణ, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, రాఘవేంద్రరావు, ఓం ప్రకాష్ గౌడ్ ,చంద్రశేఖర్, రామారావు, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జగదీష్, సెక్రటరీ దుర్గాప్రసాద్ ,జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర రావు, ట్రెజరర్ శ్రీరామ్ మరియు అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది,

Related Posts

You cannot copy content of this page