వర్షాల కారణంగా చెరువులు నిండుతున్న నేపథ్యం

Spread the love

సాక్షిత : వర్షాల కారణంగా చెరువులు నిండుతున్న నేపథ్యంలో * మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్ ఈ సత్యనారాయణ ,NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రగతి నగర్ అంబీర్ చెరువు అలుగు ఔట్ ఫ్లో, తుర్క చెరువు ఔట్ లైట్,మరియు రాజధాని స్కూల్ నుండి సాయినగర్ కమాన్ ఆర్కే లేఅవుట్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను పర్యవేక్షించి,పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ వర్షా కాలం దృష్ట్యా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు మాన్సూన్ బృందం,అధికారులు అప్రమత్తంగా ఉన్నారని,ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి నరసింహ రెడ్డి,సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి,ఇతర ముఖ్యులు ,బండారి లేఅవుట్ స్థానికులు,రాజధాని స్కూల్ ప్రిన్సిపాల్,NMC ఆయా విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page