బాచుపల్లి మొండికుంట చెరువును సందర్శించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమీషనర్ రామకృష్ణ రావు , స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు తో కలిసి ఎస్ఆర్ఆర్ ప్రైడ్ వద్ద మొండికుంట చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు చెరువులో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న మురుగునీటి సమస్య, దోమల బెడద వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ చెరువు అభివృద్ధి, డ్రైనేజ్ సమస్య నిర్మూలనకు శాశ్వత పరిష్కారినికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page