SAKSHITHA NEWS

ఆర్యాపురం శ్రీ రాధాకృష్ణ మందిరంలో
ఘనంగా గోపూజా మహోత్సవం

రాజమహేంద్రవరం, సాక్షిత : స్థానిక ఆర్యాపురంశ్రీకృష్ణ చైతన్య మిషన్, ఆశ్రమం, శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా సోమవారం బలరామ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరీ గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్యదేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహరాజ్ చేతులమీదుగా ఉదయం గోపూజ మహోత్సవం ఘనంగా జరిపారు.

గోశాల నిర్వాహకులు, గోకుల్ టి వి ఎస్ అధినేత నారా వి వి సత్యనారాయణ, శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి, ఎస్బి మోటార్స్ అధినేత ఎం రంగప్రసాద్, పివిఎస్ కృష్ణారావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత పోటీలలో పాల్గొన్న 200మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆశ్రమం ఇన్చార్జి శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు.


SAKSHITHA NEWS