SAKSHITHA NEWS

అక్టోబర్ 20 నుండి అయ్యప్ప భక్తులకు అన్నదానం,మాలధారణ, పడిపూజలు ప్రారంభం
సర్వాంగ సుందరంగ ముస్తాబైన దేవాలయం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
నిజాంపేట్ లోని శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 20 వరకు నిత్య అన్నదానం నిర్వహించబడను అన్ని ఆలయ కమిటీ పేర్కొంది. ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప మాలధారణ, పడిపూజలు, స్వామివారి కైంకర్యాల సేవల నిమిత్తమై ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ సమావేశమైంది. కొలను చంద్రశేఖర్ రెడ్డి (ఆలయ చైర్మన్), శనిగల ధన్ రాజ్ యాదవ్ (డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్), నాగార్జున ఆచార్యుల (ప్రధాన అర్చకులు)ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 20 వరకు దేవాలయ ప్రాంగణంలో నిత్య అన్నదానం నిర్వహించబడునని స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తుల మాలధారణ వారి రాక బట్టి అన్నదాన కార్యక్రమం పొడిగించబడునని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రావు (కార్పొరేటర్), ఉంగరాల శ్రీనివాస్ రావు (ఆలయ ట్రెజరర్), ఇంద్ర కుమార్ దేవ్. (గురు స్వామి), హరిబాబు (ఆర్గనైజింగ్ సెక్రటరీ ) ,
సతీష్ (జాయింట్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు.


పడిపూజ, అన్నదానం కోసం సంప్రదించండి
అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో కార్తీక మాస మండల పూజను పురస్కరించుకొని నిర్వహించే పడిపూజ, అన్నదానం, స్వామి వారి కైంకర్యాలు, ఇతరత్రా సేవల కోసం సంప్రదించాలని ఆలయ ప్రధాన పూజరులు నాగార్జున ఆచార్యులు కోరారు.సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప మాలధారణ, పడిపూజలు, ఇతరత్రా ప్రత్యేక పూజలు నిమిత్తమై అయ్యప్ప స్వామి దేవాలయం సర్వంగ సిద్ధనంగా సిద్ధమైంది. రెండు సంవత్సరాల క్రితం వేద పండితుల ఆశీర్వచనాలు, ప్రత్యేక ప్రతిష్ట, హోమాలతో ప్రారంభమైన అయ్యప్ప స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. అయ్యప్ప భక్తుల రాక, మాలధారణ సైతం గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగింది. అయ్యప్ప భక్తుల కోసం సకల సౌకర్యాలను దేవాలయ కమిటీ కల్పించింది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే దేవాలయానికి పెయింటింగ్ పూర్తి కావడంతో ఆలయం నూతన శోభతో కళకళలాడుతుంది.

WhatsApp Image 2024 08 20 at 12.42.10

SAKSHITHA NEWS