SAKSHITHA NEWS

అంబరన్నాంటేలా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించాలి
సాక్షిత : విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి సమీపంలో గల DPRC భవనంలో ఏర్పాటు చేసిన 75వ స్వత్రంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ 75వ స్వత్రంత్ర భారత వజ్రోత్సవాలు (డైమండ్ జూబ్లీ) కార్యక్రమం ప్రతి భారతీయుడు ఘనంగా నిర్వహించాలన్నారు.

▪️ మహిళా సమైక్య సంఘాల మహిళా సోదరిమనులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

▪️జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS