కాంగ్రెన్ శ్రేణులందరూ సహాయ చర్యల్లో పాల్గొనండి

Spread the love

ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి పిలుపు
సాక్షీత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఎడతెరిపి లేకుండా గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైయాయని ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కావాల్సిన తక్షణ సహాయ చర్యల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొనాలని ఆ పార్టీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వనతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఆహారం, మంచినీటి సదుపాయం కల్పించడం, వర్షాల కారణంగా జ్వరం, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధమిక చికిత్స అందించడం లాంటి వాటిలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు కలగకుండా తమ వంతు సేవలను అందించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page