SAKSHITHA NEWS

నటి జత్వాని కేసులో కీలక మలుపు
ముంబై సినీ నటి జత్వాని కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆమెను పోలీసుల అండతో కిడ్నాప్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.

ఆ కేసు ప్రత్యేక అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను సీపీ రాజశేఖర్ బాబు నియమించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆన్‍లైన్‍లో సీపీ రాజశేఖర్ కు జత్వానీ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అందగానే విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రత్యేక అధికారి బృందం రేపు ముంబై వెళ్లనుంది. ఏది ఏమైనా ఈ కేసులో సజ్జలతోపాటు మరికొందరు పోలీసు అధికారుల పేర్లు వినిపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల పాత్ర ఉంటే వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించిన సంగతి తెలిసిందే.


SAKSHITHA NEWS