కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి – అచ్ఛాలు

Spread the love

చిట్యాల సాక్షిత ప్రతినిధి

కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీన నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జరిపే ధర్నా ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామనుగుల్ల అచ్చాలు కోరారు.చిట్యాలలో రోజు మామిడి హన్మంతు అధ్యక్షతన జరిగిన గీత కార్మిక సంఘం మండల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు గునగంటి కృష్ణయ్య,ఊడుగు సత్తయ్య, మాదగోని దేవయ్య, అంతటి నర్సింహా,బూర్గు శ్రీను, బిక్షమయ్య,వెంకన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page