SAKSHITHA NEWS

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

రూ.25 లక్షలతో స్పోర్ట్స్ ఆక్టివిటీ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ నాయక్ నగర్ లో రూ.25 లక్షలతో నూతనంగా చేపడుతున్న స్పోర్ట్స్ ఆక్టివిటీ బిల్డింగ్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల కొరత లేదని, ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా రూ.10 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ నాగేశ్వర రావు, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, ఎస్ఆర్ నాయక్ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ అజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కిషోర్ రవీంద్రన్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నబీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్, స్థానిక నాయకులు యూసుఫ్, రాజ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS