A woman filed a police complaint against former minister Anil
మాజీ మంత్రి అనిల్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్ జాన్ చిన్నబజార్ సీఐకు ఫిర్యాదు అందజేశారు. నెల్లూరు భగత్సింగ్ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-25-at-18.14.02.jpeg)