SAKSHITHA NEWS

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ
హుస్నాబాద్ నియోజకవర్గ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

సాక్షిత సైదాపూర్ ప్రతినిధి కరీంనగర్ జిల్లా

ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ తెలిపారు. నియోజకవర్గ సోదరసోదరీమణులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భం అని వొడితల సతీష్ కుమార్ తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంపొందిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రేమనుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహల్లో జరుపుకోవాలని వొడితల సతీష్ కుమార్ కోరారు


SAKSHITHA NEWS