SAKSHITHA NEWS

దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు MPTC వెంకటేష్ గౌడ్ జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో రాములు పాల్గొని ప్రభుత్వ కళాశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు MPTC వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ …ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమం భావి తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని మొక్కలు నాటే కార్యక్రమoలో ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమం యజ్ఞంల భావించాలని నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అలాగే తెలంగాణలో పచ్చదనం పెరిగిందని సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు భారత దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ నాగరాణి లెక్చరర్లు ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ నరేష్ ఉపాధ్యాయులు ఎంపీ ఓ రాజ్ కుమార్ స్థానిక ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు ఐకెపి Apm నరేందర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్ జిన్నారం ఉప సర్పంచ్ నీలం సంజీవ జిన్నారం వార్డు సభ్యులు గోకర్ శ్రీధర్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్ మంద పవన్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS