కాలనీ లలో గల సమస్యలు వినతిపత్రం సమర్పించడం జరిగింది.

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మజీద్ బండ దగ్గరలోని శ్రీ గోకుల్ నగర్ కాలనీ మరియు శ్రీ మారుతి నగర్ కాలనీలకు సంబంధించిన కాలనీ నివాసులు కాలనీ లలో గల సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ
జిహెచ్ఎంసి శాంక్షన్ చేసిన 30 ఫీట్ల సిసి రోడ్డుని వేస్తుండగా కొందరు ప్రైవేటు వ్యక్తులు బెదిరించి రోడ్డు వేయడానికి నిలుపుదల చేయడం తర్వాత ఆ రోడ్డుని పూర్తిగా మూసి వేయడాన్ని నిరసిస్తూ.. సత్వర న్యాయం చేయాల్సిందిగా రోడ్డు పనులు జరిగేలా చూడలని ప్రభుత్వ విప్ గాంధీ ని కొరినారు.

ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తక్షణమే వీరికి న్యాయం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఎల్లప్పుడూ మౌలిక వసతుల సౌకర్యాలు కల్పనలు ప్రభుత్వం ముందుంటుందని వారికి హామీ ఇచ్చారు అదేవిధంగా రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించి సిసి రోడ్ ని కూడా వేయిస్తామని కాలనీ వాసులకు ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

గత వారం రోజుల నుండి సీనియర్ సిటిజెన్సు తర్వాత పిల్లలు స్కూల్కు పోయే వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం దీన్ని చూసి తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ కి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో గోకుల్ నగర్ కాలనీ మరియు మారుతి నగర్ కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page