SAKSHITHA NEWS

మణిపూర్ హింసకాండను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అశ్వారావుపేట( సాక్షిత న్యూస్ )జులై 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణిపూర్ హింసకాండపై
అశ్వారావుపేట మండలంలో నికాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొగలపు చెన్నకేశవ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కొందరు మండల నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లోని మహిళలపై దాడిని ఖండించారు . మణిపూర్ లో జరిగిన సంఘటన యావత్ భారత దేశం సిగ్గుపడాలని స్త్రీలను పూజించబడే మనదేశంలో ఇలాంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరం అని అన్నారు ఇదేనా బిజెపి ప్రభుత్వం సమాజానికి ఇస్తున్న సందేశం ప్రధానమంత్రి వెంటనే చొరవ తీసుకొని హింసను ఆపాలని అన్నారు.

అలాగే జాతీయ జెండాలోని మూడు రంగులు కలిసి ఎలా ఉన్నాయో హిందూ, క్రైస్తవ ముస్లింలు మూడు మతాలు కూడా అలాగే కలిసి ఉండాలని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా అన్ని మతాల వారు కలిసి ఉండాలని వారు అన్నారు దేశంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మొగలపు చెన్నకేశవరావు జలపల్లి దేవరాజు ఎంపీటీసీ వేముల భారతి సత్యవరపు తిరుమల నండ్రు రమేష్ .జూపల్లి ప్రమోద్. మద్ధు మరియమ్మ. చల్లారమాదేవి. మందపాటి నాగలక్ష్మి. వెంకన్న బాబు. కోలికపోగు వెంకటలక్ష్మి. తగరం రాజేష్. మేకా అమరనాథ్. శాఖ చక్రధరం. జల్లేపల్లి కృష్ణ.


SAKSHITHA NEWS