SAKSHITHA NEWS

నూతన పింఛన్లు అందజేసిన శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ .

పామర్రు నియోజకవర్గ పమిడిముక్కల మండలం ఐనపూరు సచివాలయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.

_ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు.

ఇది పేదల ప్రభుత్వం అన్నారు. ఎటువంటి వివక్షకు తావులేకుండా అర్హతలే ప్రామాణికంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కొత్త పింఛన్ మంజూరు చేసే వారన్నారు. కానీ జగనన్న సంక్షేమ పాలనలో ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి నూరుశాతం పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మార్పును ప్రతిఒక్కరూ గమనించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు…


SAKSHITHA NEWS